హరితహారంలో భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే

28 Jul, 2016 22:25 IST|Sakshi
హరితహారంలో భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే

కేతేపల్లి:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు.  గురువారం కేతేపల్లిలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండల వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్ష మొక్కలు నాటాలని సూచించారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మందడి వెంకట్రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పూజర్ల శంభయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్‌యాదవ్, బి.సుందర్, వివిధ గ్రామాల సర్పంచులు  కె.వెంకటరమణ, వి.రాము, కె.లింగయ్య, బి.కవితనరేందర్,  నాయకులు బి.శ్రీనివాస్‌యాదవ్‌  కె.మహేందర్‌రెడ్డి, కె.మల్లేష్‌యాదవ్, బి.దయాకర్‌రెడ్డి, బి.రామక్రిష్ణ, బి.నరేందర్, ఎ.వెంకట్‌గౌడ్, కె.మహేష్, కీర్తి వెంకన్న, కె.వీరన్న, టి.సాగర్, జె.వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు