మంగళగిరి : తెలంగాణ రాష్ట్రం షాద్నగర్ ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీమ్ మంగళగిరి ప్రాంతంలో విలువైన భూమి కొనుగోలు చేశాడని ప్రచారం జరుగుతుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. మండలంలోని చినకాకాని వద్ద జాతీయరహదారిని ఆనుకుని నయీమ్ భూములు కొనుగోలు చేశాడంటూ ప్రచారం జరుగుతోంది.
నయీమ్ కొనుగోలు చేశాడని చెబుతున్న సర్వే నంబర్లలోని సుమారు 15 ఎకరాల భూములు హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థతో పాటు మరో బిల్డర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉండడం విశేషం. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఈ భూమి రూ.100 కోట్ల విలువ చేస్తుంది. ఈ విషయమై పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
పోలీసు అధికారులు వివరణ కోరగా తాము పుష్కరాల విధుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నామని, అయినా ఆ అంశం తెలంగాణ పోలీసుల పరిధిలోనిదని, తమకు సంబంధం లేదని చెబుతున్నారు. తమను ఇప్పటివరకు తెలంగాణ పోలీసు అధికారులెవరూ సంప్రదించలేదని తెలిపారు.