జహీరాబాద్(మెదక్): వైద్యం వికటించి బాలింత మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా జహీరాబాద్లో గురువారం చోటుచేసుకుంది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి మహిళతో పాటు అప్పుడే పుట్టిన బాబు మృతిచెందారు. దీంతో ఆగ్రహించిన ఆమె బంధువులు ఆస్పత్రి పై దాడి చేశారు.
ఈదాడిలో ఆస్పత్రి ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకున్నారు.