గణేష్ బందోబస్తులో విధులు నిర్వర్తిస్తూ..

11 Sep, 2016 12:05 IST|Sakshi

వరంగల్: హైదరాబాద్‌లో గణేష్ బందోబస్తు కోసం వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ అస్వస్థతకు గురై మృతిచెందాడు. జిల్లాలోని ములుగు మండలం సర్వాపురం గ్రామానికి చెందిన ఎ. ముత్తయ్య తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.

గణేష్ బందోబస్తు సందర్భంగా విధులు నిర్వర్తించడానికి హైదరాబాద్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో డ్యూటీలో ఉండగా.. అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని హన్మకొండ జయ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు.
 

మరిన్ని వార్తలు