మొత్తం రూ.241.52 కోట్ల నగదు స్వాధీనం

3 Dec, 2023 02:24 IST|Sakshi

2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 248 శాతం పెరుగుదల

ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై 11,859 ఎఫ్‌ఐఆర్‌ల నమోదు

రూ.469 కోట్ల విలువైన నగదు, బంగారం, డ్రగ్స్‌ స్వాధీనం

అక్టోబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 1 వరకు వివరాలు వెల్లడించిన పోలీస్‌ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. రాష్ట్రంలో అక్టోబర్‌ 9న ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్‌ 1 వరకు పోలీసు బృందాల తనిఖీల్లో మొత్తం రూ.241.52 కోట్ల నగదు స్వాదీనం చేసుకున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.103 కోట్ల నగదు పట్టుబడగా ఈసారి ఎన్నికల నగదు స్వాదీనంలో 248 శాతం పెరుగుదల నమోదైంది. ఈ మేరకు శనివారం డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై మొత్తం 11,859 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు