పోలీసుల అదుపులో 10మంది వడ్డీ వ్యాపారులు

16 Dec, 2015 07:32 IST|Sakshi

విజయనగరం: రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంలో బుధవారం వేకువ జామున విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. దుబ్బాడ, య్యన్నపేట, విజయనగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా వారి నుంచి పలు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు