పూజారి ఆత్మహత్య

4 Jan, 2017 00:24 IST|Sakshi
నంద్యాల: వృద్ధాప్యంతో వచ్చిన అనారోగ్యాన్ని తాళలేక ఓ పూజారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్‌ ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. గోస్పాడు మండలం ఎం.చింతకుంట్ల గ్రామానికి చెందిన నెరవాటి సుబ్రమణ్యం (75) గ్రామంలో ఉన్న ఆలయంలో పూజారి సేవలందిస్తూ చిరు వ్యాపారం నిర్వహించేవాడు. వయస్సు అధికం కావడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆలయానికి కూడా వెళ్లడం మానేశాడు. మంగళవారం ఉదయం 9 గంటలకు నంద్యాలకు వచ్చిన ఆయన చిన్న చెరువు వద్దకు వెళ్లి కుమారుడి సెల్‌ నంబర్‌ను కాగితంపై రాసి దుస్తులు అక్కడే ఉంచి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సెల్‌ నంబర్‌ ఆధారంగా కుమారుడు నాగరాజుకు సమాచారాన్ని అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టానికి తరలించారు. మృతి చెందిన సుబ్రమణ్యంకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.     
మరిన్ని వార్తలు