హన్మకొండ అర్బన్ : ఆదివాసీ ప్రాంతాల తో ములుగు జిల్లా కేంద్రంగా సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ కాకతీయ కళాపీఠం ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో డీఆర్వోకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులు, వనరుల విభజనకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ప్రజా సంఘాలు మే«ధావులతో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో పీఠం వ్యవస్థాపక అ««దl్యక్షులు శ్రీధర్రాజు, కొమురం ప్రభాకర్, చందా మహేష్, తదితరులు ఉన్నారు.