తెగిపడ్డ విద్యుత్ వైర్లు.. రైళ్లు ఆలస్యం

21 Dec, 2016 07:41 IST|Sakshi

వెంకటాచలం: నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద బుధవారం ఉదయం రైల్వే విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. దీంతో నేటి ఉదయం గూడురు-నెల్లూరు మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే మార్గంలో వెళ్లనున్న జమ్ము-కశ్మీర్‌ ఆర్మీ రైలు సహా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
 

మరిన్ని వార్తలు