అంతర్జాతీయ కరాటే పోటీలకు విద్యార్థినుల ఎంపిక

9 Aug, 2016 00:10 IST|Sakshi
జఫర్‌గఢ్‌ : మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కస్తూరిబా పాఠశాలకు చెందిన విద్యార్థినులు అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల వరంగల్‌లో జరిగిన జాతీ య స్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో  జరిగిన ఈ పోటీల్లో పాఠశాలకు చెంది న నలుగురు విద్యార్థినులు అంత్యంత ప్రతి భను కనబర్చి  అంతర్జాతీయ స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ స్వప్న తెలిపారు. వీరిలో పి.భవాని, బి.రమ, ఎం.మానస, వి. ప్రవళిక ఉన్నట్లు పేర్కొన్నారు. ఈనెల 26 నుంచి 30 వరకు పాండిచ్చేరిలో జరిగే అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొంటారని ఆమె తెలిపారు.  పోటీలకు ఎంపిక కావడంపై విద్యార్థులతో పాటు పాఠశాల పీఈటీ మహాలక్ష్మిని ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వారిని అభినందించారు.  
>
మరిన్ని వార్తలు