రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు శంకరాస్‌ విద్యార్థులు

27 Jan, 2017 23:44 IST|Sakshi
రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు శంకరాస్‌ విద్యార్థులు
కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన యువజనోత్సవాల్లో శంకరాస్‌ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఉత్సవాలకు ఎంపిక అయ్యారు.  ఈ సందర్భంగా  ఎంపికైన విద్యార్థులను ఆ కాలేజీ డైరెక్టర్‌ డాక్టర​ హరికిషన్, ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు శుక్రవారం కళాశాలలో అభినందించి మాట్లాడారు. క్విజ్‌ పోటీలలో వెంకటరమణ, రూపేష్‌ , సోలోసాంగ్‌ పోటీలలో శ్రావణి విజేతలుగా నిలిచారన్నారు. వీరు ఈ నెల 30 వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొంటారన్నారు.  కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పీఓ మద్దిలేటి, అధ్యాపకులు సోమశేఖర్, రఘునందన్, పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు