మద్యం మత్తులో తండ్రిని చితకబాదిన కొడుకు

4 Oct, 2015 09:25 IST|Sakshi

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట మండలం ఉండూరులో ఆదివారం ఓ దారుణం వెలుగుచూసింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన కొడుకు తన తండ్రిని చితకబాదాడు.

దాంతో తండ్రి చిట్టిపల్లి అబ్బాయికి గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు  సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు