-
మద్యం మత్తులో తండ్రిని చితకబాదిన కొడుకు
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట మండలం ఉండూరులో ఆదివారం ఓ దారుణం వెలుగుచూసింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన కొడుకు తన తండ్రిని చితకబాదాడు. దాంతో తండ్రి చిట్టిపల్లి అబ్బాయికి గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘సిరిరేఖల’పై పెను నిర్లక్ష్యం
అమలాపురం, న్యూస్లైన్ : గోదావరి డెల్టా ఆధునికీకరణను అటు సర్కారూ చిన్నచూపు చూస్తుండగా ఇటు కాలమూ కలిసిరావడం లేదు. అస్తవ్యస్తంగా మారిన పంట కాలువలను ఆధునికీకరించేందుకు దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి రూ.1,130 కోట్లు మంజూరు చేశారు. పనులను తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి 2007లో టెండర్లు పిలిచారు. తొలుత తూర్పుడెల్టాలో కాకినాడ, మండపేట, కోటిపల్లి బ్యాంకు కెనాల్, సామర్లకోట, మధ్యడెల్టాలో పి.గన్నవరం ప్యాకేజీలకు టెండర్లు ఖరారయ్యాయి. తరువాత రెండేళ్ల వరకు టెండర్లు పడకపోవడంతో మిగిలిన నాలుగు ప్యాకేజీలను 16 చిన్నప్యాకేజీలు చేసి టెండర్లు పిలిచారు. మధ్యడెల్టా పరిధిలోని ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ పరిధిలో అన్నంపల్లి నుంచి పల్లంకుర్రు వరకు రూ.72 కోట్ల విలువ చేసే రెండు ప్యాకేజీలకు టెండర్లు ఖరారయ్యాయి. ఆధునికీకరణ పనులు నిర్ణీత షెడ్యూలు ప్రకారం 2012 జూన్ నాటికి పూర్తి కావలసి ఉంది. గడువు ముగిసి ఏడాది దాటినా 33 శాతం పనులు కూడా పూర్తికాలేదు. పనుల్లో జాప్యం వల్ల అంచనా వ్యయం పెరుగుతోంది. అయితే ప్రభుత్వం దానికి తగ్గట్టు నిధులు పెంచకపోగా ఉన్న పనులను(లాకులు, వంతెనల పనులు) కుదించడంతో ఆధునికీకరణ లక్ష్యమే వరద గోదాట్లో ఇసుకతిన్నెలా మరుగున పడుతోంది. సకాలంలో నీరందక, వరదల్లో నీరు చేలను ముంచెత్తి రైతులు ఏటా రూ.వందల కోట్ల నష్టాలను మూటగట్టుకోవలసి వస్తోంది. ఈ ఏడాది రూ.75 కోట్లే టెండర్లు ఖరారైన ప్యాకేజీల్లో సుమారు రూ.600 కోట్ల విలువైన పనులు జరగాల్సి ఉండగా ఇంత వరకు రూ.250 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. ఇంకా రూ.350 కోట్ల విలువైన పనులు జరగాల్సి ఉండగా ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.75 కోట్లకు మాత్రమే పరిపాలన అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఆధునికీకరణ పనులు జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తయిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. సొమ్ములు మిగిలే మట్టి పనులు మాత్రమే చేసి నిర్మాణ పనులకు దూరంగా ఉండడం కూడా పనులు ఆలస్యం కావడానికి కారణమవుతోంది. డెల్టా ఆధునికీకరణకు కాలమూ ప్రతికూలంగా మారింది. ఏటా ఖరీఫ్ పంట ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోవడంతో రబీలో పంట కాలువలకు లాంగ్ క్లోజర్ ప్రకటించే అవకాశం లేకుండా పోతోంది. రెండేళ్ల క్రితం గోదావరిలో నీటికి ఎద్దడి నెలకొన్న సమయంలో మాత్రమే మండపేట, కాకినాడ కాలువలను మూసివేసి పనులు చేయగలిగారు. మిగిలిన చోట్ల ఆ పరిస్థితి లేకపోయింది. ఈ ఏడాది పంటకాలువల మూసివేత సమయంలో రూ.75 కోట్లతో ఆధునికీకరణ పనులు చేయాలని ఇటీవల కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ అధికారులు తేల్చారు. మార్చి నెలాఖరు నుంచి జూన్ 15 వరకు కాలువలు మూసివేసి 75 రోజుల్లో ఆధునికీకరణ పనులు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ఏడాది రబీసాగు ఆలస్యం కావడంతో ఏప్రిల్ నెలాఖరు వరకు డెల్టాకు సాగునీరందించక తప్పదు. దీంతో క్లోజర్ సమయం 45 రోజులకే పరిమితం కానుంది. ఈ కారణంగా ఈసారీ పెద్దగా పనులు జరిగే ఆశ లేకుండా పోయింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు వేములవాడకు మోదీ!
4 నెలల్లోనే రేవంత్ అబద్ధాలకోరు అని తేలింది
జగన్కు జైన్ సంఘం మద్దతు
త్వరితగతిన చందనోత్సవం ఏర్పాట్లు
మూడోరోజు 3,500 పోస్టల్ ఓటింగ్
వైఎస్సార్సీపీలోనే కాపులకు ప్రాధాన్యం
యాదవుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ పెద్దపీట
‘వర్షా’తిరేకం!
ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
స్టీల్ప్లాంట్పై సీఎం ప్రకటన హర్షణీయం
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement