ఇబ్రహీంపట్నంలో కూరగాయల మార్కెట్ దగ్ధం

19 Apr, 2016 10:45 IST|Sakshi

- రూ.10లక్షల ఆస్తి నష్టం
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి జిల్లా)

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పట్టణంలోని మంచిర్యాల రోడ్డులో ఉన్న కూరగాయల మార్కెట్ మంగళవారం వేకువజామున దగ్ధమైంది. గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడంతో తడికెలతో నిర్మించుకున్న 16 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.10లక్షల రూపాయల ఆస్థి నష్టం సంభవించిందని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు