అనంతపురం సెంట్రల్ : నగర శివారులోని ద్వారకావిల్లాస్లోని ఓ అపార్ట్మెంట్ నివాసముంటున్న లైన్మన్ దైవసహాయం ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి లైన్మన్ కుటుంబసభ్యులతో కలిసి శనివారం గుంతకల్లుకు వెళ్లారు. ఆదివారం తిరిగి వచ్చే సరికి ఇంట్లో చోరీ అయినట్లు గుర్తించారు. దుండగులు తలుపులు పగులగొట్టి బీరువాలోని రూ.25వేల నగదు ఎత్తుకుపోయినట్లు బాధితుడు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.