ఫొటో స్టూడియోలో చోరీ

12 Jan, 2017 23:41 IST|Sakshi

ముదిగుబ్బ : ముదిగుబ్బలోని సిండికేట్‌ బ్యాంక్‌ ఎదుట గల మంజు అనే వ్యక్తికి చెందిన ఫొటో స్టూడియోలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. స్టూడియో తలుపులు పగులగొట్టిన దుండగులు లోనికి ప్రవేశించి రూ.60 వేలు విలువ చేసే పెద్ద కెమెరా సహా మరో చిన్న కెమెరా, హార్డ్‌ డిస్క్, రూ.3,500 నగదు ఎత్తుకెళ్లారు. వాటి విలువ మొత్తం రూ.80 వేలు ఉంటుంది. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.

>
మరిన్ని వార్తలు