శివాలయంలో హుండీ చోరీ

12 Dec, 2016 15:08 IST|Sakshi
వైఎస్సార్ కడప: జిల్లాలోని సుండుపల్లి పోలీస్‌ స్టేషన్ ఎదురుగా ఉన్న శివాలయంలో శుక్రవారం చోరీ జరిగింది. ఆలయ హుండీని గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి నగదు, కానుకలు దోచుకె ళ్లారు. హుండీలో సుమారు రూ.2లక్షల వరకు నగదు ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని వార్తలు