-
తీవ్రగాయాలు
-
హైదరాబాద్కు తరలింపు
కోహెడ : వరి సాగు కోసం కేజీవీల్ ట్రాక్టర్తో పొలం దున్నుతున్న రైతు ప్రమాదవశాత్తు.. వ్యవసాయ బావిలో పడిన సంఘటన మండలంలోని వరికోలు గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు బోయిని రామయ్య(56) తన ట్రాక్టర్తో పొలాన్ని దమ్ముకొడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దుసుకెళ్లింది. ట్రాక్టర్తోసహా రామయ్య బావిలో పడ్డాడు. గమనించిన సమీప రైతులు బావిలో నుంచి రైతును బయటకు తీశారు. తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స కోసం కరీంనగర్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందని గ్రామస్తులు తెలిపారు.