20 నుంచి కొత్త విమాన సర్వీసులు

13 Jan, 2017 21:59 IST|Sakshi

గన్నవరం(కృష్ణా) : గన్నవరం విమానాశ్రయానికి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. టర్బో మెగా ఎయిర్‌వేస్‌కు చెందిన ట్రూజెట్‌తోపాటు స్పైస్‌జెట్‌ సంస్థలు కొత్తగా అదనపు విమాన సర్వీసులు నడిపేందుకు ముందుకువచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, కడప, తిరుపతికి విమాన సర్వీసులు నడుపుతున్న ట్రూజెట్‌ సంస్థ ఈ నెల 20వ తేదీ నుంచి హైదరాబాద్‌కు రెండవ విమాన సర్వీసును నడపనుంది. ఈ విమానం ప్రతిరోజు మధ్యాహ్నం 12.40కు గన్నవరం నుంచి బయలుదేరి 1.40గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.

ఫిబ్రవరి 19 నుంచి వారణాసికి సర్వీస్
స్పైస్‌జెట్‌ విమాన సంస్థ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి వారణాసి నుంచి హైదరాబాద్‌ మీదుగా ఇక్కడికి నూతన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఈ విమాన సర్వీస్‌ మంగళవారం మినహా వారంలో ఆరు రోజులపాటు ఉంటుంది. ఈ విమానం ప్రతిరోజు వారణాసి నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌ మీదుగా మధ్యాహ్నం 1.50కు గన్నవరం చేరుకుంటుంది. ఇక్కడ మధ్యాహ్నం 2.40 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌ మీదుగా సాయంత్రం 6.55కు వారణాసి చేరుకుంటుంది.  ఈ సర్వీస్‌ నిమిత్తం స్పైస్‌జెట్‌ సంస్థ 189 సీటింగ్‌ కెపాసిటీ కలిగిన 737–800 బోయింగ్‌ విమానాన్ని నడపనుంది. ప్రస్తుతం ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్న విమానాల్లో ఇదే అతిపెద్ద విమానం కావడం విశేషం.

మరిన్ని వార్తలు