పెరిగిన రాత్రి ఉష్ణోగ్రతలు | Sakshi
Sakshi News home page

పెరిగిన రాత్రి ఉష్ణోగ్రతలు

Published Fri, Jan 13 2017 9:54 PM

temmperature details

అనంతపురం అగ్రికల్చర్‌ : పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతుండగా రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగాయి. శుక్రవారం అగళి మండలంలో 14.8 డిగ్రీలు కనిష్టం నమోదు కాగా తక్కిన మండలాల్లో 16 నుంచి 20 డిగ్రీల వరకు కొనసాగాయి. నాలుగైదు మండలాల్లో 20 డిగ్రీలకు పైబడి కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పగలు 30 నుంచి 34 డిగ్రీలు నమోదయ్యాయి.

గాలిలో తేమ ఉదయం 65 నుంచి 80, మధ్యాహ్న సమయంలో 25 నుంచి 40 మధ్య రికార్డయింది. గాలులు గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచాయి. చలికాలం మధ్యలోనే రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో వేసవి సంకేతాలు ముందస్తుగానే కనిపిస్తున్నాయి. 

Advertisement
Advertisement