నయీం కేసులో విస్మయకర విషయాలు

20 Aug, 2016 16:21 IST|Sakshi
హైదరాబాద్:  గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో విస్మయకర విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఈ కేసు విచారణలో పది రోజుల పసికందు విక్రయం బయటపడింది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం ఏనెమీది తండాకు చెందిన దత్తు అనే వ్యక్తి మిర్యాలగూడలో ఉండే నయీం అత్త సుల్తానాకు పది రోజుల పసికందును విక్రయించినట్లు గుర్తించారు. దత్తు నుంచి కొనుగోలు చేసిన పసికందును సుల్తానా నయీంకు అప్పగించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు ఆర్‌ఎంపీలు కీలక పాత్ర పోషించినట్లు గుర్తించిన సిట్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
మరిన్ని వార్తలు