మద్దికెర: మండలపరిధిలోని బసినేపల్లికి చెందిన ఉపాధి కూలీ మల్లికార్జున(50) వడదెబ్బకు గురై ఆదివారం మరణించాడు. శనివారం ఉపాధి పనులకు వెళ్లి వచ్చిన వెంటనే ఆస్వస్థతకు గురికావడంతో చికిత్సకోసం వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.