రమేష్ కుటుంబానికి అండగా ఉంటాం: జిల్లా ఎస్పీ

18 Sep, 2015 10:46 IST|Sakshi

నల్గొండ: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎస్సై రమేష్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని నల్గొండ జిల్లా ఎస్పీ దుగ్గల్ అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలం శేరుపల్లిలో ప్రారంభమైన రమేష్ అంతిమ యాత్రలో ఎస్పీతోపాటు వివిధ పార్టీల నాయకులు, గిరిజన సంఘాలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ దుగ్గల్ మాట్లాడుతూ... రమేష్ గిరిజన నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎస్సై అయిన తీరును వివరించారు. అయితే రమేష్ మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కేసును సీఐడీ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుందని దుగ్గల్ చెప్పారు.

మరిన్ని వార్తలు