రైలు కింద గుర్తు తెలియని యువతి మృతి

8 Apr, 2017 23:12 IST|Sakshi

తాడిపత్రి రూరల్‌ : తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డులో గల రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని ఓ యువతి(20) రైలు కింద పడి శనివారం మరణించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఆమె ప్రమాదవశాత్తు పడిందా లేక ఆత్మహత్య చేసుకుందా అనేది తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. 

మరిన్ని వార్తలు