రాజీవ్గాంధీ అంతర్జాతీయ ఏయిర్పోర్టులో బుల్లెట్ కలకలం రేపింది. శంషాబాద్ నుంచి అస్సాం వెళ్తున్న శ్రీకాంత్ అనే ఆర్మీ జవాన్ వద్ద రెండు బుల్లెట్లు లభించడంతో.. అప్రమత్తమైన ఏయిర్పోర్టు సిబ్బంది విచారణ చేపడుతున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే ఆర్మీ జవాన్ శంషాబాద్ నుంచి బయలుదేరుతున్న సమయంలో చెకింగ్లో బుల్లెట్లు బయటపడ్డాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.