హైదరాబాద్: నగరంలోని లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మికులకు 20 శాతం బోనస్ ఇవ్వాలని, ఇప్పుడు పనిచేస్తున్న వారందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు.