ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం

18 Mar, 2017 11:16 IST|Sakshi
హైదరాబాద్‌: నగరంలోని అల్వాల్‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక గంగపుత్ర కాలనీలో నివాసముంటున్న స్వప్న(40) తన ఇద్దరు పిల్లలు గాయత్రి(17), మనోజ్‌(14)లకు ఎలకల మందు కలిపిన పాలు ఇచ్చి అనంతరం తాను తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు వారిని 108 సాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని స్థానికులు భావిస్తున్నారు. 
మరిన్ని వార్తలు