- మున్సిపల్ కార్మికుల ఆందోళన
-కూకట్ పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: తమ వేతనాలను నగదు రూపంలో ఇవ్వాలంటూ మున్సిపల్ కార్మికులు ఆందోళకు దిగారు. కూకట్పల్లి వివేకానంద నగర్లోని ఎస్బీహెచ్ శాఖ వద్దకు మంగళవారం ఉదయం భారీగా చేరుకున్న కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులను శాంతింపజేసేందుకు యత్నిస్తున్నారు.