చంద్రబాబు దావోస్ పర్యటనకు రూ.కోటి

14 Jan, 2016 15:47 IST|Sakshi
చంద్రబాబు దావోస్ పర్యటనకు రూ.కోటి

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తలపెట్టిన స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకోసం రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేయడమేగాక.. అడ్వాన్సుగా రూ.70 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు సారథ్యంలోని ప్రతినిధి బృందం ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు దావోస్‌లో పర్యటించనుంది. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సులో పాల్గొననుంది.

మరిన్ని వార్తలు