స్కూల్కి ఆలస్యంగా వస్తారా ?

9 Apr, 2015 11:07 IST|Sakshi
స్కూల్కి ఆలస్యంగా వస్తారా ?

హైదరాబాద్: నగరంలో కృష్ణా నగర్లో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్కి ఆలస్యంగా వచ్చిన 25 మంది చిన్నారులపై బుధవారం స్కూల్ యాజమాన్యం ఆగ్రహం ప్రకటించింది. స్కూల్కు ఆలస్యంగా వస్తారా అంటూ చిన్నారులతో గుంజీలు తీయించింది. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దంటూ చిన్నారి విద్యార్థులను టీచర్లు తరగతి గది బైట మూడు గంటలపాటు నిలబెట్టారు.

దీంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దాంతో విద్యార్థులు కాళ్ల వాపు, జర్వంతో బాధపడుతున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న చిన్నారి విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని స్కూల్ యాజమాన్యంతో వాదనకు దిగారు.

మరిన్ని వార్తలు