నగరంలోని మూడు దుకాణాల్లో చోరీ

12 Dec, 2016 15:17 IST|Sakshi

హైదరాబాద్: తాళం వేసి ఉన్న మూడు దుకాణాలలో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. నగరంలోని వనస్థలిపురం కాలనీలో మంగళవారం రాత్రి మూడు దుకాణాల షట్టర్‌లు పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు దుకాణాల్లోని నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు.

ఇది గుర్తించిన షాపుల యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఎంత మొత్తంలో నగదు చోరీకి గురైంది అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు