కావూరి హిల్స్‌ వద్ద కారు బీభత్సం, యువతి పరారీ

13 May, 2017 10:17 IST|Sakshi
కావూరి హిల్స్‌ వద్ద కారు బీభత్సం, యువతి పరారీ

హైదరాబాద్‌ : ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ రోడ్డు ప్రమాద ఘటన మరవక ముందే కావూరి హిల్స్‌ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో రాంగ్‌ టూర్‌లో వచ్చిన  ఓ యువతి  తన మినీ కూపర్‌ కారును వెనుక నుంచి ఓ  టాటా సఫారీని వేగంగా ఢీకొట్టింది. అయితే ఆ సమయానికి ఎయిర్‌ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న యువతికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. 

ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.  ఆ యువతి బర్త్‌డే పార్టీలో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఆ యువతి కారు వదలి అక్కడ నుంచి అదృశ్యమైంది. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి ఆచూకీ కోసం సీసీ టీవీ ఫుటేజ్‌ ద్వారా విచారణ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు