ఘోర ప్రమాదం | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం

Published Sat, May 13 2017 10:24 AM

road accident in thamil nadu

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, లారీ ఢీకొని ఏడుగురు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరూర్‌ జిల్లా కుళితలై వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెల్తున్న కారు, లారీ ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement