2వేలకు చేరిన ఇండోనేసియా మృతులు

9 Oct, 2018 04:08 IST|Sakshi

పలూ: ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో సునామీ, భూకంపం సంభవించి పది రోజులు గడిచినప్పటికీ మృతుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు పలూ పట్టణంలో సుమారు 2వేల మృతదేహాలను వెలికితీశామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. తొలుత 5వేలకు పైగా గల్లంతు అయ్యారని భావించిన్పటికీ.. ప్రస్తుతమున్న పరిస్థితి చూస్తుంటే అంచనాకు అందటం లేదన్నారు. హోటల్‌ మొత్తం జల్లెడపట్టామని, ఇక్కడ 27 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.  దీంతో మరణించిన వారి సంఖ్య 1,944కు చేరుకుంది. ఈ నెల 11 వరకు అధికారికంగా గాలింపుచర్యలు చేపడతామని స్థానిక మిలటరీ ప్రతినిధి తోహిర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు