బ్రేక్‌ తర్వాత జాన్‌

6 Oct, 2019 00:18 IST|Sakshi
ప్రభాస్‌

‘సాహో’ వంటి భారీ యాక్షన్‌ మూవీ తర్వాత ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). 1970 నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ఈ నెల  నాలుగో వారంలో ప్రారంభం కానుందని సమాచారం. ఎమోషన్, సెంటిమెంట్‌ అంశాలకు మాస్‌ ఎలిమెంట్స్‌ జోడించి ఈ కథను సిద్ధం చేశారట రాధాకృష్ణ. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. హాలిడేలో భాగంగా ప్రభాస్‌ ప్రస్తుతం ప్యారిస్‌లో ఉన్నారని తెలిసింది.

మరిన్ని వార్తలు