స్కూల్ బస్సును ఢీకొన్న రైల్ ఇంజిన్ : ఇద్దరి మృతి

30 Jul, 2015 09:49 IST|Sakshi

రాంచీ : జార్ఖండ్లో గురువారం స్కూల్ వ్యాన్ను రైలు ఇంజిన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో స్కూల్ బస్సు పూర్తిగా ధ్వంసమైంది.

మరిన్ని వార్తలు