ఉత్తరప్రదేశ్ కల్తీ మద్యం సంఘటనలో 37 మంది మృతి

19 Oct, 2013 15:43 IST|Sakshi

ఉత్తరప్రదేశ్లో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 37కు పెరిగింది. అజంగఢ్ జిల్లా ముబారక్పూర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మరణించిన వారిలో ఎక్కువగా కార్మికులు, పేదలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మద్యం వ్యాపారులు నీళ్లలో స్పిరిట్ను కలిపి చౌక ధరకు విక్రయించడం ద్వారా పరిస్థితి విషమించినట్టు అధికారులు తెలిపారు.

ఈ సంఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంది. జిల్లా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఓం ప్రకాష్ సింగ్తో సహా పదిమంది అధికారుల్ని సస్పెండ్ చేసింది. న్యాయ విచారణకు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదేశించారు.

మరిన్ని వార్తలు