క్రిమినల్‌ను వెంబడిస్తుండగా ఏకే 47 పేలి..

6 Jan, 2016 15:12 IST|Sakshi
క్రిమినల్‌ను వెంబడిస్తుండగా ఏకే 47 పేలి..

న్యూఢిల్లీ: ఓ క్రిమినల్ను వెంబడించే క్రమంలో తన చేతిలోని తుపాకీ మిస్ ఫైర్ అయ్యి ప్రత్యేక విభాగ పోలీసు అధికారి ప్రాణాలుకోల్పోయాడు. ఈ ఘటన ఢిల్లీ శివారు ప్రాంతంలోని రోహిణిలో బుధవారం వేకువజామున చోటుచేసుకుంది.

రవీంద్ర భోలు అనే రౌడీ షీటర్ కు కీలక సన్నిహితుడైన సోనూపండిట్ అనే నేరస్తుడు రోహిణి సెక్టార్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న ఢిల్లీ ప్రత్యేక పోలీస్ సెల్ విభాగం అతడి కోసం వేకువజామున గాలింపులు మొదలుపెట్టారు. అతడిని గుర్తించి వెంబడించే క్రమంలో చేతిలోని ఏకే 47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలిపోయి ఆనంద్ ఖాత్రి(32) అనే పోలీసు తీవ్రంగా గాయాలపాలై  ప్రాణాలుకోల్పోయాడు. 2015 చివరి రోజుల్లోనే ఆనంద్ ప్రత్యేక సెల్కు బదిలీ అయ్యాడు.

మరిన్ని వార్తలు