న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిక్రి బోర్డర్ ప్రాంతంలోని ఓ గోడౌన్లో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరకుని మంటలను అదపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 30 అగ్నిమాపక యంత్రాలను అక్కడ మోహరించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.