కోల్‌కతా గీతాంజలి రైల్వే స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

14 Oct, 2019 11:36 IST|Sakshi

కోల్‌కతా: ఓ వ్యక్తి మెట్రో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో.. మెట్రో సేవలకు అరగంటసేపు అంతరాయం కల్గింది. ఈ సంఘటన పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంది. ఓ మధ్యవయస్కుడు సోమవారం ఉదయం 9.28 గంటల ప్రాంతంలో కోల్‌కతాలోని గీతాంజలి రైల్వే స్టేషన్‌లో ఎదురుగా వస్తోన్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై అతడిని బయటకు లాగారు. ఈ నేపథ్యంలో ఓ అరగంటపాటు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత యధావిధిగా కొనసాగాయి. ఇంతకు ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి ఎవరు.. ఏ కారణం చేత ఆత్మహత్యాయత్నం చేశాడనే వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు