మోడీ సర్కార్ సంచలన నిర్ణయం

30 Oct, 2014 16:16 IST|Sakshi
మోడీ సర్కార్ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో మరణించిన సిక్కుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలను చెల్లించాలని మోడీ సర్కార్ ఆదేశాలు జారీ చేయనుంది. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం ద్వారా 3,325 మంది కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. 
 
గతంలో ఢిల్లీలో షీలాదీక్షిత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినా.. అమలు చేయడంలో విఫలమైంది. 

మరిన్ని వార్తలు