మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

16 Jan, 2017 04:52 IST|Sakshi
మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై రూ.0.42 పైసలు, డీజిల్‌పై 1.03 పైసల ధరను పెంచుతున్నట్లు ఆయిల్‌ కంపెనీలు ఆదివారం రాత్రి ప్రకటించాయి. ఆరు వారాల వ్యవధిలో పెట్రో ధరల పెంపు ఇది నాలుగో సారి. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.

తాజాగా పెరిగిన ధరలతో న్యూఢిల్లీలో ఒక లీటరు పెట్రోల్‌ ధర 71.13కు చేరుకోగా, డీజిల్‌ ధర 59.02పైసలకు చేరుకుంది. జనవరి 2వ తేదీన పెట్రోల్‌పై  రూ.1.29, డీజిల్‌పై రూ.0.97 పైసల ధరను పెంచిన విషయం తెలిసిందే. ఆయిల్ ధరలు పెంచడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.