గందరగోళం నడుమ.. పార్లమెంట్‌ నిరవధిక వాయిదా

5 Jan, 2018 13:46 IST|Sakshi

రాజ్యసభ గడపదాటని ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు.. చివరిరోజూ వాదులాట

లోక్‌సభలో 12 బిల్లులకు ఆమోదం..

శీతాకాల భేటీలో వాడివేడి చర్చలు.. ఫిబ్రవరిలో బడ్జెట్‌ సమావేశాలు..

సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయంగా విపరీతమైన వేడిని పుట్టించిన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజు గందరగోళం నడుమ ఉభయసభలూ నిరవధికంగా వాయిదాపడ్డాయి. వివాదాస్పద ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు రాజ్యసభలోనే ఉండిపోయింది. లోక్‌సభలో మొత్తం 12 బిల్లులకు ఆమోదం లభించింది. మరికొద్దిరోజుల్లోనే అంటే, ఫిబ్రవరిలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి.

మరిన్ని వార్తలు