ఎమ్మెల్యే కొడుకు దారుణం!

17 Sep, 2016 17:52 IST|Sakshi
ఎమ్మెల్యే కొడుకు దారుణం!

న్యూఢిల్లీ: బిహార్లో దారుణం చోటుచేసుకుంది. తన కారును ఓవర్ టేక్ చేశాడని ఆగ్రహంతంతో ఆర్జేడీ ఎమ్మెల్యే బిరేంద్ర సిన్హా కుమారుడు కునాల్ ప్రతాప్ ఓ యువకుడిని కత్తితో పొడిచాడు. ఔరంగాబాద్ జిల్లాలోని ఓబ్రా అనే ప్రాంతంలో కారులో వెళుతున్న కునాల్ ఓ బైక్పై వెళుతున్న యువకుడిని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కునాల్ మరోసారి వేగంగా వెళ్లి అతడిని ఆపేసి దాడి చేసి కొట్టి కత్తితో పొడిచినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.

కత్తిపోట్లకు గురైన ఆ బాధితుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ కేసులో పోలీసులు కునాల్ను అరెస్టు చేశారు. కాగా, ఎమ్మెల్యే బిరేంద్ర ఈ ఘటనపై స్పందిస్తూ తన కుమారుడు ఎవరిపై హత్యాయత్నం చేయలేదని, అతడే తనను తాను కోసుకొని తన కుమారుడిపై ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డాడు. కునాల్ ను అరెస్టు చేయలేదని, కేవలం వివరణ ఇచ్చేందుకు అతడు పోలీస్ స్టేషన్కు వెళ్లాడని చెప్పారు. తన రాజకీయ చరిత్రను మసకబార్చే కుట్రలో భాగంగా తానంటే గిట్టని వాళ్లు ఈ పనిచేయించి ఉంటారని ఆరోపించాడు. తన కుమారుడు అమాయకుడని తనకు నమ్మకం ఉందని, త్వరలోనే నిజనిజాలు తెలుస్తాయని తెలిపారు.

మరిన్ని వార్తలు