ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం

9 Apr, 2017 12:44 IST|Sakshi
ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం

పాట్నా: న్యూఢిల్లీ - పాట్నా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు పది మంది దోపిడీ దొంగలు బక్సర్‌ సమీపంలో రైల్లోకి ప్రవేశించి ప్రయాణికులపై దాడి చేశారు. వారి వద్ద నుంచి నగదు, బంగారు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పాట్నా రైల్వే పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ఇన్‌స్పెక్టర్‌ సహా ఆరుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు