'ఆ హత్యలో నాకూ భాగం ఉంది.. నాకన్నీ తెలుసు'

11 May, 2016 13:22 IST|Sakshi
'ఆ హత్యలో నాకూ భాగం ఉంది.. నాకన్నీ తెలుసు'

ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో కీలక పురోగతి వైపు మళ్లింది. ఈ కేసులో కీలక నిందితుడు, ఇప్పటికే అరెస్టయి జైలులోనే ఉన్న విచారణ ఖైదీ.. ఇంద్రాణీ డ్రైవర్ శ్యాంవర్ రాయ్ అప్రూవర్ గా మారాడు.

కోర్టులో పలు నిజాలు చెప్పేందుకు అంగీకరించాడు. తాను ఇప్పటి వరకు చెప్పని అంశాలు ఇప్పుడు కోర్టు ముందు ఉంచుతానని అన్నాడు. ఈ నేరానికి సంబంధించిన విషయాలు తనకు తెలుసని, ఈ హత్యలో తాను కూడా ఒక భాగస్తుడినని తెలిపాడు. షీనా బోరాను గొంతునులిమి ఊపిరి ఆగకుండా చేసి హత్య చేసినట్లు కోర్టుకు చెప్పాడు.

మరిన్ని వార్తలు