హంద్వారాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

3 Mar, 2019 12:06 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్ము,కశ్మీర్‌లోని గత మూడు రోజులుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా కుప్వారా జిల్లా హంద్వారా ఏరియా బాబాగుండ్‌లో ఆదివారం భద్రతాదళాలు...ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. మరోవైపు  ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో రెండు ఇళ్లు, రెండు గోశాలలు ధ్వంసమైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా గత మూడు రోజులుగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందినవారిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, ఇద్దరు జమ్ము,కశ్మీర్‌ పోలీసులు ఉన్నారు. 
 

మరిన్ని వార్తలు