అమరులకు వైఎస్సార్‌ సీపీ నేతల ఘన నివాళి

13 Dec, 2018 12:24 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ : 2001 డిసెంబర్‌ 13న పార్లమెంట్‌పై జరిగిన తీవ్రవాదుల దాడిలో అమరులైన వారికి వైఎస్సార్‌ సీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ గురువారం తీవ్రవాదుల దాడిలో అమరులైన వారి సంస్మరణార్థం పార్లమెంట్‌ ఆవరణలో ఏర్పాటైన కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నేతలు అమరులకు ఘనంగా నివాళులర్పించి, అంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. 17 సంవత్సరాల క్రితం ఇదే రోజున తీవ్రవాదులు పార్లమెంట్‌ భవనంపై దాడికి తెగబడ్డారు. వీరిని నిలువరించే ప్రయంత్నంలో పలువురు భద్రతా సిబ్బంది సైతం తమ ప్రాణాలు కోల్పోయారు.  

మరిన్ని వార్తలు