‘అవినీతి ప్రభుత్వాన్ని ఎండగడతాం’

3 Sep, 2019 20:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ అవినీతిని భయటపెట్టాలని  నిర్ణయించుకున్నట్లు బీజేపీ కోర్‌ కమిటీ  సభ్యుడు ప్రేమేందర​ రెడ్డి  డిమాండ్‌ చేశారు. మంగళవారం బీజేపీ కోర్‌ కమిటీ మీటింగ్‌ ముగిసిన తర్వాత ప్రేమేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే అవినీతిపై ప్రజలకు అవగాహన కల్పించి, అవినీతి టీఆర్‌ఎస్‌ను ఎండగట్టడానికే నిర్ణయించుకున్నామన్నారు. ఈ మున్నిపల్‌ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపుతామని, పార్లమెంట్‌ నియోజకవర్గాలను క్లస్టర్‌గా విభజించి ఎన్నికల్లో పనిచేస్తాం అన్నారు.

>
మరిన్ని వార్తలు