కపిల్‌ మిశ్రాపై 48 గంటల నిషేధం

26 Jan, 2020 05:11 IST|Sakshi
కపిల్‌ మిశ్రా

న్యూఢిల్లీ: ఢిల్లీ మోడల్‌ టౌన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్‌ మిశ్రాపై ఎన్నికల సంఘం 48 గంటల ప్రచార నిషేధం విధించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను భారత్‌–పాక్‌ ఎన్నికలుగా వర్ణిస్తూ కపిల్‌ ట్వీట్‌ చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఈసీ ఆదేశాల మేరకు ట్విట్టర్‌ సంస్థ కపిల్‌ చేసిన ట్వీట్లను తొలగించింది.

మరిన్ని వార్తలు